నవతెలంగాణ-హైదరాబాద్ : రెండు దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోడీ నేడు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత సైప్రస్లో పర్యటిస్తారు. అయితే, అక్కడ ఆయన అధికారిక కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడ పర్యటన ముగిసిన అనంతరం కెనడాకు బయలుదేరి వెళ్తారు. కెనడాలో మంగళవారం జరగనున్న జీ7 (గ్రూప్ ఆఫ్ సెవెన్) దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొంటారు. ప్రపంచంలోని ఏడు ప్రధాన పారిశ్రామిక దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ సభ్యులుగా ఉన్న ఈ కూటమి సమావేశంలో పలు అంతర్జాతీయ, ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, చర్చించబోయే అంశాలపై త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కెనడాలో జీ7 సదస్సు..సైప్రస్కు బయలుదేరిన ప్రధాని మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES