- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రయివేటు జెట్ కూలి లిబియా సైన్యాధ్యక్షుడు అలీ మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం టర్కీలోని అంకారాలో జరిగింది. ప్రయివేటు జెట్ కుప్పకూలిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో లిబియా సైన్యాధ్యక్షుడితో పాటు నలుగురు అధికారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. జెట్ రన్ వే పై నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు.
- Advertisement -



