Tuesday, December 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రయివేటు ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం

ప్రయివేటు ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సంగారెడ్డి జిల్లాలో ప్రయివేటు ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా కోహిర్ మండలం కవేలీ చౌరస్తా వద్ద అదుపుతప్పింది. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.

ఈ క్రమంలోనే అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణిస్తున్నారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -