– జే ఈ ఈ అడ్వాన్స్ లో 657 ర్యాంకర్ శ్రీమాన్ ను
– అభినందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో నల్లగొండ ఎస్ఆర్ కాలేజ్ కి చెందిన విద్యార్థిని. 100వ ర్యాంకు సాధించిన బచ్చు ప్రియాంకను. శనివారం నల్లగొండ శరత్ చంద్ర పవార్ తన క్యాంప్ లో ఆఫీస్ లో శాలువాతో సన్మానించి అభినందించారు. అదేవిధంగా జే ఈ ఈ అడ్వాన్స్ లో 657 ర్యాంకర్ సాధించిన లచ్చమల్ల శ్రీ మాన్ రాజ్ తండ్రి శ్రీ రామ్ (డి.ఎస్.పి ఆఫీస్ లో రైటర్)లని ఎస్పీ శాలువలుతొ సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించారు. అలాగే ప్రియాంక ,శ్రీ మాన్ రాజ్ తల్లితండ్రులాను, ప్రియాంక చదివిన ఎస్సార్ కళాశాల యాజమాన్యంని అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ రమేష్, డి.ఎస్.పి కె.శివరాం రెడ్డి, ఎస్.ఆర్ కాలేజ్ నల్గొండ జోనల్ ఇంచార్జి దోనాల శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ జోనల్ సతీశ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నీట్ 100 వ ర్యాంక్ విద్యార్థిని ప్రియాంక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES