- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఈడీ విచారణకు హాజరయ్యారు. రామకృష్ణ బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి అరవింద్ను ఈడీ అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో భాగంగా 2018-19 సంవత్సరాల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై వివరాలు అడిగారు. రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి అల్లు అరవింద్కు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో ఈ విచారణ చేశారు. అనంతరం అధికారులు అల్లు అరవింద్కు వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -