సీనియర్ నిర్మాత, ఏ.ఏ.ఆర్ట్స్ అధినేత కావూరి మహేంద్ర (79) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్థరాత్రి 12 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1946 ఫిబ్రవరి 4న గుడివాడ తాలుకా దోసపాడులో మహేంద్ర జన్మించారు. కె.ప్రత్యగాత్మ, కె.హేమాంబరధరరావు వద్ద దర్శకత్వశాఖలో పని చేశారు. తరువాత ప్రొడక్షన్ కంట్రోలర్గా పలు చిత్రాలకు సేవలందించారు. మద్రాస్లో గీత ఆర్ట్స్, హైదరాబాద్ వచ్చాక ఏ.ఏ.ఆర్ట్స్ బ్యానర్లను స్థాపించి ‘ప్రేమించి పెళ్ళి చేసుకో’ చిత్రంతో నిర్మాతగా మారారు. ‘ఏది పుణ్యం?, ఏది పాపం?’, ‘ఆరని మంటలు’, ‘తోడు దొంగలు’, ‘బందిపోటు రుద్రమ్మ’, ‘ఎదురులేని మొనగాడు’, ‘ఢాకూరాణి’, ‘ప్రచండ భైరవి’, ‘కనకదుర్గ వ్రత మహాత్యం’, ‘పోలీసు’, ‘దేవా’ వంటి తదితర 50 చిత్రాలకు పైగా నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పరిశ్రమలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
‘పోలీసు’ చిత్రంతో శ్రీహరిని హీరోగా పరిచయం చేశారు. అలాగే ఆయనతోనే ‘దేవా’ చిత్రాన్ని నిర్మించి ఘన విజయాన్ని అందుకున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేనిని కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. మహేంద్రకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన కుమార్తెను నటుడు, నిర్మాత మాదాల రవి వివాహం చేసుకున్నారు. కాగా, కొంత కాలం క్రితం మహేంద్ర తనయుడు జీతు మరణించారు. అభిరుచిగల నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న మహేంద్ర మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
నిర్మాత కె.మహేంద్ర కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES