- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ తమిళ నిర్మాత, డైరెక్టర్ తమిళ్ అళగన్ కన్నుమూశారు. అళగన్ ప్రొడ్యూసర్గా బ్లాక్బస్టర్ ‘బాషా’, చిరంజీవి-రజినీ కాంబోలో ‘రానువ వీరన్’(తెలుగులో బందిపోటు సింహం) తదితర చిత్రాలను నిర్మించారు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. అళగన్ తమిళనాట లెజెండరీ ప్రొడ్యూసర్, రచయిత, మాజీ మంత్రి ఆర్ఎమ్ వీరప్పన్ కొడుకు. కాగా అళగన్ మరణంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
- Advertisement -



