– సమస్యల పరిష్కారానికే పరిమితం కాకూడదు
– సైద్ధాంతిక భావజాలాన్ని పెంపొందించాలి
– వర్గ చైతన్యమిచ్చే సంఘం ఎస్ఎఫ్ఐ
– సంపదకు బదులు దారిద్య్రం పెంచుతున్న మోడీ : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రారంభోపన్యాసం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
విద్యార్థి సమస్యల పరిష్కారానికే ఎస్ఎఫ్ఐ పరిమితం కాలేదని.. కాకూడదని ప్రముఖ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. వర్గ చైతన్యం ఇచ్చే సంఘం ఎస్ఎఫ్ఐ అని చెప్పారు. విద్యాపరమైన అసమానతలే ఆదా యపరమైన అసమానతలకు దారి తీస్తాయని.. ధనిక, పేద అంత రాలను దాటి విద్యార్థి ఉద్య మాలను నిర్మించాలని పిలుపు నిచ్చారు. ఏ సిద్ధాంతమైనా ఆచ రణ నుంచి రావాలని, ఆచరణ కోసం అధ్యయనం చేయా లని సూచించారు. ఆలోచనల పోరా టంలో ఎస్ఎఫ్ఐ ముందుం డాలన్నారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం (సీతారాం ఏచూరి నగర్)లో కొనసాగుతున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలో నాగేశ్వర్ రెండో రోజు శనివారం ప్రారంభోపన్యాసం చేశారు. ప్రజా ఉద్యమాలకు కీలక నాయకులను ఇచ్చింది ఎస్ఎఫ్ఐ అన్నారు. వర్గ చైతన్యం ఇచ్చే సంఘం ఇదే అన్నారు. ప్రభుత్వ విద్యారంగం నాడు బలంగా ఉండేదని, నాటి భిన్నత్వమే సామాజిక చైతన్యానికి కారణమై ఉండొచ్చని విశ్లేషించారు.
అంతరాలను దాటి విద్యార్థి ఉద్యమాలు
ధనిక, పేద అంతరాలను దాటి విద్యార్థి ఉద్యమాలు నిర్మించాలని నాగేశ్వర్ పిలుపునిచ్చారు. కార్పొరేట్ల లాభాలు 400 శాతం పెరిగితే ఉద్యోగుల జీతాలు ఐదు శాతం మాత్రమే పెరుగుతున్నాయని తెలిపారు. 10 శాతంగా ఉన్న కార్పొరేట్లకు భారత ప్రభుత్వం రూ.1.45 లక్షల కోట్ల రాయితీలు ఇస్తోందన్నారు. తద్వారా విద్యా, ఆరోగ్యం లాంటి సామాజిక రంగాల్లో ఖర్చు పెట్టలేకపోతోందని తెలిపారు. రూ.2.2 లక్షల కోట్లు మాత్రమే సామాజిక రంగాలపై ఖర్చు చేస్తోందన్నారు. కార్పొరేట్ల నుంచి వచ్చే ఆదాయం నానాటికీ తరుగుతోందని, ఒకప్పుడు 32 శాతంగా కార్పొరేట్ల నుంచి ఆదాయం వస్తే ప్రస్తుతం 26శాతం మాత్రమే లభిస్తోందని తెలిపారు. దేశంలో 22 కోట్ల మంది ప్రజల రోజువారీ ఆదాయం రూ.300 కన్నా తక్కువగా ఉంటే గౌతమ్ అదానీకి రోజుకు రూ.1600 కోట్ల ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ప్రధాని మోడీ సంపదను కాకుండా దారిద్య్రాన్ని పంచుతానంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో 40 శాతం సంపద ఒక శాతం మంది చేతిలో ఉంటే.. 50 శాతం జనాభాకు మూడు శాతం ఆదాయం మాత్రమే లభిస్తోందన్నారు. ఇలాంటి స్థితిలో ప్రజల కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐ సైద్ధాంతిక భావాజాలాన్ని పెంపొందించాలని సూచించారు. దేశంలో రాజ్యాంగమే సుప్రీమని తెలిపారు. పార్లమెంటుకు కూడా రాజ్యాంగాన్ని మార్చే అర్హత లేదన్నారు. లౌకికత్వం, సామ్యవాదం అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని హౌంమంత్రి అమిత్ షా మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యానికి మతం లేదని లౌకికత్వం చెబుతోందన్నారు. పహల్గాం ఉగ్రదాడిని బీజేపీ సోషల్ మీడియా ముస్లిం దాడిగా చిత్రీకరిస్తోందన్నారు. హార్స్ రైడర్ సయ్యద్ హుస్సేన్ షా పర్యాటకులను కాపాడిన విషయాన్ని గమనించాలని కోరారు.
ఎస్ఎఫ్ఐ దృక్పథాన్ని ఇచ్చింది : మువ్వా శ్రీనివాసరావు
ఎస్ఎఫ్ఐ తనకు దృక్పథాన్ని ఇచ్చిందని ఆహ్వాన సంఘం చైర్మెన్ మువ్వా క్రాంతి శ్రీనివాసరావు అన్నారు. స్వావలంబన ఇవ్వని విద్య వ్యర్థమని వివేకానందుడు అన్న మాటలను గుర్తు చేశారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యా కాషాయీకరణ చేస్తూ.. చరిత్రను మార్చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రూ.3.25 లక్షల చెక్కును ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థి నాయకులు సంఘానికి అందజేశారు.
ఈ సభలో సీఐటీయూ జాతీయ నాయకులు ఎస్.వీరయ్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, ఏఐడీఎస్వో రాష్ట్ర నాయకులు మల్లేష్ సౌహార్థ సందేశం ఇచ్చారు. సభలో ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను, ఉపాధ్యక్షులు ఆధిత్య నారాయణ్, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ఎల్.మూర్తి, టి.నాగరాజు, రిసెప్షన్ కమిటీ చైర్మెన్ రవిమారుత్, ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు ఐవీ రమణారావు, లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొప్పిశెట్టి సురేష్, ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థి సంఘ నాయకులు ఎం.సుబ్బారావు, కోట రమేష్, భూక్యా వీరభద్రం, మూఢ్ శోభన్ నాయక్, కళ్యాణం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నూతన విద్యా విధానం పేరుతో 300 స్కూళ్లు మూత
మాజీ ఎంపీ మిడియం సౌహార్థ సందేశం
సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఆదివాసీలు రాష్ట్రంలో 11 జిల్లాల్లో ఉన్నారని మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు తెలిపారు. ఈ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యా సంస్థలను మూసేస్తున్నారని చెప్పారు. నూతన విద్యా విధానం పేరుతో దాదాపుగా సంవత్సర కాలంలో 300 స్కూళ్లను మూసేశారని చెప్పారు. 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండగా, అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు వచ్చిన ఉపాధ్యాయులు లేరని అన్నారు. ఏకలవ్య స్కూల్ నిర్వహణ పట్ల నిర్లక్ష్యం చూస్తుంటే ఆదివాసీల విద్య పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత వివక్ష చూపుతుందో అర్థమవుతోంద న్నారు. ములుగు గిరిజన విశ్వవిద్యాలయం బోర్డులకే పరిమితమైందన్నారు. భద్రాచలం ప్రభుత్వ బీఈడీ కాలేజీలో సరైన స్టాఫ్ లేరన్నారు. శాస్త్రీయ విద్య, సమాజ మార్పునకు ఎస్ఎఫ్ఐ ఎనలేని కృషి చేస్తోందన్నారు.
సవాళ్ల మధ్య విద్యారంగం
ప్రస్తుతం విద్యార్థి ఉద్యమం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. కొత్త సవాళ్లు, అనేక ఆటుపోట్లు ఎదురైనా సమాజ మార్పునకు నికరంగా నిలిచిన సంఘం ఎస్ఎఫ్ఐ అని చెప్పారు.
– సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు
ఆచరణ కోసం అధ్యయనం
- Advertisement -
RELATED ARTICLES