- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్: రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐలుగా 8 మంది ప్రమోషన్ పొందారు. ఈ సందర్భంగా మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమోషన్ పొందిన ఏఎస్ఐలకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -