Monday, June 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పరిరక్షణ అందరి బాధ్యత

ఉపాధి హామీ పరిరక్షణ అందరి బాధ్యత

- Advertisement -

నవతెలంగాణ – ధర్మసాగర్
గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ అందరి బాధ్యత అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు చిలక రాఘవులు ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ కూలీల పని ప్రదేశాన్ని సందర్శించి మాట్లాడారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడకు టెంట్ మెడికల్ కిట్ వంటి కనీస సౌకర్యాలు లేవన్నారు. కూలీలకు కనీసం పనిముట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కూలి డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని పేస్లిప్పులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఉపాధి హామీ నిరుపేదల పొట్ట కొట్టే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలపై తీసుకుంటుందని, దానికి తెలంగాణ రాష్ట్రం ఉన్న నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారని మంది పడ్డారు. కూలీల విషయంపై బిజెపి ఎంపీలు మంత్రులు ఏం మాట్లాడడం లేదని హెడ్డివా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని గుర్తు చేశారు.తక్షణమే వీటిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆధార్ కార్డు లింక్ తో ఆన్లైన్ పేమెంట్ చెల్లింపులు కొలతలు ఆధారంగా వేదినాలు ఇచ్చే పద్ధతిని రద్దు చేయాలన్నారు.పని దినాలను 200 రోజులకు 600 రూపాయలు చెల్లించాలన్నారు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని వారికి పర్మిషన్ చేసే జీతాలు పెంచాలన్నారు సంవత్సరానికి 12 వేల రూపాయలు అమలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ఉపాధి హామీ కూలి వేతనాల బకాయిలను విడుదల చేయాలని పట్టణ పేదలకు ఉపాధి పని పెట్టాలని కోరారు.ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం ఈ నెల 30న జిల్లా కలెక్టర్ రేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -