నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఈ నెల 13 తేది ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే నివాసంలో యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన గందమల్ల రవి మృతిపై సీనియర్ పోలీస్ అధికారులచే సమగ్ర విచారణ చేయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు బిఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. రవి మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన అనంతరం వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఇమ్మడి రాంరెడ్డి, వస్పరి శంకరయ్య, కర్రె వెంకటయ్య, గడ్డమీది రవిందర్గౌడ్, పాపట్ల నరహారి, ముక్కెర్ల సతీష్, కొన్యాల నర్సింహారెడ్డి, శారాజీ రాజేష్, పేరబొయిన సత్యనారాయణ, మాటూరి బాలయ్య, కల్వకొలను సతీష్భట్, శ్రీనివాస్గౌడ్, అశోక్, బాబురావు, స్వామి లు పాల్గొన్నారు.
సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES