Monday, September 15, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

- Advertisement -
  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
    నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్: ప్రజావాణి ఫిర్యాదులను జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టరెట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు తో కలసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వివిధ అంశాలను సమీక్షిస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రజావాణిలో పెండింగ్ ఫిర్యాదులపై దృష్టి సారించి తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అధికారి తమ శాఖ సిబ్బందితో రేపు, ఎల్లుండి స్టాప్ మీటింగ్ పెట్టాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి ఫీల్డ్ మీటింగ్ లేదా వెబ్ ఎక్స్ మీటింగ్ పెట్టి సిబ్బందికి సూచనలు జారీ చేయాలని, ఎలాంటి పెండింగ్ పనులు లేకుండ పూర్తి చేయాలని అన్నారు.

ప్రజావాణిలో భూములకు సంబంధించి 10 ఫిర్యాదులు, ఎంపీడీవోలకు 9 ,వైద్య ఆరోగ్య శాఖకి 2, డిపిఓకి 2, ఇతర అధికారులకు 18 ఫిర్యాదులు ,మొత్తం 41 ఫిర్యాదులు వచ్చాయని వీటన్నింటిని సంబంధిత శాఖల అధికారులకు పంపడం జరిగిందని, జాగ్రత్తగా అన్నిటిని పరిశీలించి ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించెందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓ పిడి వివి అప్పారావు, డిపిఓ యాదగిరి, డిఏఓ శ్రీధర్‌రెడ్డి, డిసీఓ పద్మ, డిఈఓ అశోక్, డి ఎంహెచ్‌ఓ చంద్రశేఖర్,సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్ నాయక్, కలెక్టరేట్ పరిపాలనాధికారి సుదర్శన్ రెడ్డి, సూపర్టీడెంట్లు, అధికారులు, సిబ్బంది తదితరులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరుయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -