– పతాకాన్ని ఆవిష్కరించిన ఏడీ హేమంత కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట : స్థానిక వ్యవసాయ కళాశాలలో బుధవారం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జై హేమంత్ కుమార్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలతో సాధించిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు, ప్రతి ఒక్కరూ బాధ్యతతో తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలి అన్నారు.తర్వాత వ్యవసాయ కళాశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ సాయుధ పోరాటంలో తమ సర్వస్వాన్ని కోల్పోయి, తెలంగాణ విముక్తే ద్యేయంగా ముందుకు సాగిన వీరుల చరిత్రను గుర్తు చేసుకున్నారు.
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES