- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తీవ్ర అలసటతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మొహాలిలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనకు పలు రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, సోమవారం మోగాలో జరిగిన ‘యుద్ధ నషేయన్ విరుధ్’ ర్యాలీలో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ‘డ్రగ్స్ ఎగైనెస్ట్ 2.0’ ప్రచారాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
- Advertisement -



