Saturday, May 31, 2025
E-PAPER
Homeజాతీయంఘోర అగ్ని ప్రమాదం..ఐదుగురు స‌జీవ ద‌హ‌నం

ఘోర అగ్ని ప్రమాదం..ఐదుగురు స‌జీవ ద‌హ‌నం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పంజాబ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. శ్రీ ముక్త్‌సర్ సాహిబ్ జిల్లాలోని సింఘవాలి-కోట్లీ రహదారిపై ఉన్న రెండంతస్తుల భవనంలో బాణసంచా తయారీ, ప్యాకేజింగ్ యూనిట్‌లో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. ఈ బ్లాస్ట్‌లో మొత్తం ఐదుగురు వలస కార్మికులు అక్కడిక్కడే కాలి బూడిదై ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఆ రెండంతస్తుల భవనం కుప్పకూలి శిథిలాల కింది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో మరో 25 మందికి తీవ్ర గాయాలైనట్లుగా లంబి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జస్పాల్ సింగ్ తెలిపారు. ఈ మేరకు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -