- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ : రైతులు పండించిన ధాన్యాన్ని ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ట్యాబ్ ఎంట్రీ, కేంద్రాలలోని వసతులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అకాల వర్షాలు పడుతున్న కారణంగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రాజా గౌడ్, మానిటరింగ్ అధికారి నరేష్, డిటి శ్రీనివాస్, సొసైటీ సీఈవో మోహన్ గౌడ్, రైతులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -