జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని 12 మండలాలలో రైతుల నుంచి ఇప్పటివరకు 66,030 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. జిల్లాలో 10,833 మంది రైతుల నుండి ఇప్పటి వరకు 66,030 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. కొనుగోలు విలువ 153.19 కోట్లు కాగా ఇప్పటి వరకు 79.30 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. గత సంవత్సరం ఇదే సీజన్ లో 39,675 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, గత సంవత్సరం సీజన్ కంటే ఈ సంవత్సరం సీజన్ లో 26355 మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు జరిగిందని తెలిపారు. ఈ సీజన్ లో ధాన్యం కొనుగోలు గణనీయంగా పెరిగినట్లు ఆయన స్పష్టం చేశారు.