- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
ప్రభుత్వ పాఠశాలలోనే అనుభవాద్యులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య అందుతుందని శుక్రవారం ఉపాధ్యాయులు యాదయ్య, శ్రీనివాస్ అన్నారు. మండలంలోని గోకుల్ తండాలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి, ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో పేరెంట్స్ సమావేశం నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లను చదివించాలని, పాఠశాలలో పూర్తి సబ్సిడీపై ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందిస్తుందని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అబ్దుల్ ఖాదర్, సిఆర్పి మహమ్మద్, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -