- Advertisement -
ముంబయి: ఇంగ్లాండ్, భారత్ మహిళల వన్డే సిరీస్కు యువ స్పిన్నర్ సుచి ఉపాధ్యారు దూరమైంది. ఈ నెల 28 నుంచి ఇంగ్లాండ్ పర్యటనలో భారత మహిళల జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. బెంగళూర్లోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరుగుతున్న శిక్షణ శిబిరంలో గాయపడిన సుచి వన్డే సిరీస్కు దూరమైంది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో సుచి రాణించిగా సెలక్టర్లు ఇంగ్లాండ్ టూర్కు ఎంపిక చేశారు. సుచి స్థానంలో రాధ యాదవ్ను వన్డే జట్టుకు ఎంపిక చేస్తూ మహిళల సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
- Advertisement -