నవతెలంగాణ-హైదరాబాద్: త్రిపుర రాజధాని అగర్తాలాలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి మిస్సింగ్ను పోలీసులు ఛేదించారు. యువకుడిని చంపి ఐస్క్రీమ్ ఫ్రీజర్లో దాచినట్లు గుర్తించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. ముగ్గురి మధ్య నడిచిన ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని, వారి మొబైల్ మెసేజ్ల ఆధారంగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. అగర్తల స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న సరిఫుల్ ఇస్లాం(20) పని చేస్తున్నారు. ఈ యువకుడు, దిబాకర్ సాహా(28) అనే వైద్యుడు మరో మహిళ మధ్య నడిచిన ట్రయాంగిల్ లవ్స్టోరీ ఈ హత్యకు దారితీసిందన్నారు. హత్య కేసులో ఆ డాక్టర్, అతని తల్లిదండ్రులతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జూన్ 8న సాయంత్రం డాక్టర్ దిబాకర్ సాహా.. సరిఫుల్ను సౌత్ ఇంద్రానగర్ కబర్ఖలా ప్రాంతానికి రమ్మని పిలిచాడు. అక్కడి జోరుదీప్ దాస్(20) ఇంటిలో బహుమతి ఇస్తానని చెప్పాడు. అతని మాట మేరకు సరిఫుల్ అక్కడకు రాగానే దిబాకర్, అతని స్నేహితులు అనిమేష్ యాదవ్(21) నబనితా దాస్(25) అతనిపై దాడి చేసి.. హత్య చేశారు. తరువాత మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్లో ప్యాక్ చేసి పోలీసులు తెలిపారు. మర్నాటి ఉదయం దిబాకర్తో పాటు అతని తల్లిదండ్రులు దీపక్, దేబికా సాహాలు గండచెర్రా నుండి అగర్తలాకు మతదేహం ఉన్న ట్రాలీ బ్యాగ్ను తీసుకెళ్లారు. తరువాత శవాన్ని గండచెర్రా మార్కెట్లోని వారి దుకాణంలోగల ఐస్ క్రీం ఫ్రీజర్లో దాచారు. ఈ కేసును పోలీసులు రోజుల వ్యవధిలో ఛేదించారు. మంగళవారం రాత్రి ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం సరిఫుల్ ఇస్లాం మతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారందరినీ గురువారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
త్రిపురలో దారుణం..ఐస్క్రీమ్ ఫ్రీజర్లో డెడ్బాడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES