– రైల్వే బోర్డుకు సీఐటీయూ లేఖ
– రిటైరైన సిబ్బందిని వలంటీర్లుగా నియమించుకోవడంపై నిరసన
న్యూఢిల్లీ: రిటైర్డ్ అయిన రైల్వే సిబ్బందిని వలంటీర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిన తిరిగి నియమించుకోవాలంటూ రైల్వే బోర్డు జారీ చేసిన ఆదేశాలను సీఐటీయూ తీవ్రంగా నిరసించింది. పే లెవల్-1 నుంచి పే లెవల్-9కి మధ్యలో గల నాన్ గెజిటెడ్ ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ నెల 20న రైల్వే బోర్డుకు లేఖ రాసింది. మంజూరైన పోస్టులను తిరిగి సరెండర్ చేయకుండా సిబ్బంది కొరత సమస్యను పరిష్కరించేందుకు ఖాళీగా వున్న పోస్టుల్లో తక్షణమే రిక్రూట్మెంట్ ప్రక్రియను చేపట్టాలని సీఐటీయూ ఆ లేఖలో కోరింది. రిటైరైన సిబ్బందిని తిరిగి నియమించుకునే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది. రైల్వేలో మొత్తంగా రెండున్నర నుంచి మూడు లక్షల వరకు గల ఖాళీలను భర్తీ చేయడానికి బదులుగా బోర్డు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం నిరుద్యోగులైన యువతపై క్రూరత్వం చూపడమేనని సీఐటీయూ లేఖ విమర్శించింది. రిటైరైన ఉద్యోగులను ఇలా తిరిగి తీసుకుంటూ అనాగరికమైన అనిశ్చితి, తాత్కాలికత, అన్యాయాన్ని కలిగించడం ద్వారా రైల్వే కార్మిక వ్యవస్థ కూర్పును మొత్తంగానాశనం చేయడానికి ప్రభుత్వం, రైల్వే శాఖ ప్రయత్నిస్తున్నాయని సీఐటీయూ తన లేఖలో విమర్శించింది. రైల్వేలో దాదాపు 12 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు వుంటే 6లక్షల మందికి కాంట్రాక్టు లేబర్ వున్నారని తెలిపింది.
రైల్వే ఖాళీలు భర్తీ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES