- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: శుక్రవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్సిటీ తదితర ప్రాంతాల్లో కురిసిన వానలో వాహనదారులు తడిసిముద్దయ్యారు. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఉదయం నుంచి ఎండవేడిమితో అల్లాడిన నగరవాసులు సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.
- Advertisement -