– అధికారుల దాడులతో భయపడిన ప్రభుత్వోద్యోగి
– అపార్ట్మెంట్ కిటికీ నుంచి కరెన్సీ విసిరివేత
భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో డబ్బు వర్షం కురిసింది. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండీ…ఓ వ్యక్తి తన అపార్ట్మెంట్ కిటికీ నుండి ఐదు వందల రూపాయల నోట్ల కట్టల్ని బయటికి విసిరేశాడు. అతనికేమైనా పిచ్చి పట్టిందని అనుకుంటున్నారా? అదేమీ కాదు. అసలు ఏం జరిగిందంటే…డబ్బు కట్టలు విసిరేసిన వ్యక్తి పేరు వైకుంఠనాథ్ సారంగి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రభుత్వం ఆయన నుంచి రెండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది. ఒడిషాలోని అంగుల్, భువనేశ్వర్, పిపిలి (పూరి)లోని ఏడు ప్రాంతాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి రూ.2.1 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయా ప్రాంతాలలో ఆయనకు ఇండ్లు, ఫ్లాట్లు, ఆఫీస్ ఛాంబర్ ఉన్నాయి.
అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలోనే సారంగి తన వద్ద ఉన్న నోట్ల కట్టలను కిటికీలో నుండి బయటికి విసిరేసేందుకు ప్రయత్నించారు. అయితే సాక్షుల సమక్షంలో అధికారులు వాటిని ఆ తర్వాత స్వాధీనం చేసుకున్నారు. అంగుల్లోని సారంగి నివాసంలో రూ.1.1 కోట్లు, భువనేశ్వర్ ఫ్లాటులో మరో కోటి రూపాయలు లభించాయి. 26 మంది పోలీస్ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. సారంగి వద్ద లభించిన నగదులో రూ.500, రూ.200, రూ.100, రూ.50 నోట్ల కట్టలు ఉన్నాయి.
భువనేశ్వర్లో నోట్ల వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES