Tuesday, July 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలురాజాసింగ్ రాజీనామా..మంత్రి పొన్నం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాజాసింగ్ రాజీనామా..మంత్రి పొన్నం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బీజేపీ మరోసారి తన బీసీ వ్యతిరేక వైఖరిని స్పష్టంగా బయటపెట్టుకుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేయడంపై ఆయన స్పందిస్తూ, ఆ పార్టీని ఒక ఫ్యూడల్ పార్టీగా అభివర్ణించారు. ఈ మేరకు సోమవారం ఆయన తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా బీజేపీపై విమర్శలు చేశారు.

బీసీ నేతను అడ్డుకున్నారు: పొన్నం
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ నాయకుడు నామినేషన్ వేయడానికి ప్రయత్నిస్తే, ఆయనను నిరంకుశంగా అడ్డుకున్నారని పొన్నం ఆరోపించారు. నామినేషన్‌కు మద్దతు తెలిపిన వారిని సైతం భయభ్రాంతులకు గురిచేయడం బీజేపీ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆయన అన్నారు.

“ముగ్గురు బీసీ ఎంపీలు, ఎందరో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి బీజేపీకి మనసొప్పలేదు. గతంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి, కనీసం శాసనసభాపక్ష నేతగా కూడా అవకాశం ఇవ్వలేదు” అని పొన్నం విమర్శించారు. బీజేపీలో బీసీలకు ఎప్పటికీ న్యాయం జరగదని, ఆ పార్టీ నేతలే ఈ విషయంపై వాపోతున్నారని, దీనికి బీజేపీ అధిష్టానం ఏం సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -