- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ చేతులు మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దివంగత క్రికెటర్ షేన్ వార్న్ కుటుంబానికి రూ.450 కోట్లు దక్కనున్నాయి. ఐపీఎల్ ప్రారంభ సమయంలో రాజస్థాన్కు షేన్వార్న్ కెప్టెన్గా వ్యవహరించాడు. అంతేకాకుండా క్రికెట్ కార్యకలాపాలపై అతనికి నియంత్రణ కల్పించారు. ఇందుకు గాను ఏటా అతనికి 0.75 శాతం యాజమాన్య వాటాను కేటాయించారు. వార్న్ మొత్తం నాలుగు సీజన్లు ఆడగా, 3 శాతం వాటా అతనికి సొంతమైంది.
- Advertisement -



