నవతెలంగాణ -తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం కెనరా బ్యాంక్ పస్రా, కెనరా బ్యాంక్ తాడ్వాయి పరిధిలోని గ్రామాల యువతీ యువకులకు జాయింట్ స్క్రీనింగ్ నిర్వహించారు. మండలంలో అనుకున్న దానికంటే ఎక్కువగా నే రాజీవ్ యువశక్తి దరఖాస్తులు అప్లై చేసుకున్నట్లు ఎంపీడీవో సుమన వాణి తెలిపారు. సుమారు 1000 దరఖాస్తులను జాయింట్ స్క్రీనింగ్ చేసినట్లు తెలిపారు. ఇలా మండల స్థాయిలో లబ్ధిదారుల లెక్కలు తేల్చి ఆ జాబితాను జిల్లా కమిటీకి అందించనున్నారు. వారు ఎంపిక చేసిన తుది జాబితా లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఇన్చార్జి మంత్రి ఆమోదముద్రలతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు (జూన్ 2) వారికి మంజూరు పత్రాలు అనేవి పంపిణీ చేసేలా కసరత్తు చేస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సుమన వాణి, ఏపిఎం శ్రీనివాసరావు, పస్రా, తాడ్వాయి కెనరా బ్యాంక్ శాఖల మేనేజర్లు, ఎంపీఓ శ్రీధర్ రావు, ఏహెచ్ ఎస్ తాడ్వాయి పీజీహెచ్ఎం కోట రేవతి తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి లో రాజీవ్ యువ వికాసం జాయింట్ స్క్రీనింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES