Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ర్యాలీ 

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ర్యాలీ 

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ 
ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా నిర్వహించిన గ్రీన్ ర్యాలీని అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, నిజామాబాదు రీజీనల్ పర్యావరణ అధికారి జి. లక్ష్మణ్ ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గ్రీన్ ర్యాలీని బాలాభవన్ నుండి తిలక్ గార్డెన్ మీదుగా న్యూ అంబేద్కర్ భవనం వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, జిల్లా వైద్యాధికారులు, జిల్లా సైన్స్ అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు, డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, పర్యావరణవేత్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అదనపూ కలెక్టర్ కిరణ్ కుమార్ జిల్లా బాల భావన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా అంతం చేద్దాం అనే నినాదంను యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన నేపద్యంలో భూమి, నీరు & వాయు సంరక్షణ, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడం, మొక్కలు నాటడడం ద్వారా పచ్చదనం పెంచడం వంటి కార్యక్రమాల వలన కాలుష్యాన్ని తగ్గించవచ్చని, ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిర్మూలించాలని అదనపూ జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. గత నెల 30వ తేదీన జిల్లా బాలాభవన్ వేదికగా విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వారు నిర్వహించిన వివిద పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు మరియు ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ కవర్స్ వలనకలిగే కాలుష్యం గురించి అవగాహన కల్పిస్తూ జనపనార సంచిలను (జ్యూట్ బాగ్) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ సంజయ్ గౌడ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు అజ్జ శ్రీనివాస్, డాక్టర్ శ్రీశైలం,కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయము, నిజామాబాదు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -