- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్కు బయల్దేరారు. డీజీసీఏ, ఎయిరిండియా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘‘ప్రమాదంపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నా. సహాయ బృందాలు ఇప్పటికే ఘటనా స్థలిలో ఉన్నాయి’’ అన్నారు.
- Advertisement -