నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీకి చర్యలు తీసుకుంటుందని గనౌఫౌండ్రి డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నేత పి చంద్రమోహన్ యాదవ్ అన్నారు. గన్ ఫౌండ్రి డివిజన్ పరిధిలోని బొగ్గులకుంట, హనుమాన్దేక్లీ, తదితర ప్రాంతాల్లో ఆర్ పి అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన రేషన్ కార్డుల సర్వే కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ నాయకులు సంతోష్యాడవ్, రమేష్, ఫర్వేజ్, మల్లేష్ యాదవ్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి రేషన్ కార్డు దరఖాస్తుల సర్వేకు సహకరించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ యాదవ్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో రేషన్వి కార్డు లవిచారణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి, రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేలా తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు
రేషన్ కార్డుల సర్వే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES