- Advertisement -
నవతెలంగాణ-సదాశివ నగర్ : మండలంలోని రేషన్ డీలర్లు సోమవారం కమిషన్ విడుదల చేయాలని సదాశివ నగర్ తహాసిల్దార్ ఆకుల సత్యనారాయణకు వినతి పత్రం అందించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ నుండి ఆగస్టు నెల వరకు రేషన్ డీలర్ ల కమిషన్ రాలేదని తెలిపారు. ఎంతోమంది కమిషన్ పై ఆధారపడి జీవిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఐదు నెలల నుండి కమిషన్ రాలేదని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కమిషన్ ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 17200 మంది డీలర్లు ఉన్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ మండల డీలర్లు పాల్గొన్నారు
- Advertisement -