- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ లీగ్ బిగ్బాష్లో అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే బిగ్బాష్లో ఆడే తొలి సీనియర్ ఇండియన్ క్రికెటర్గా అశ్విన్ నిలవనున్నారు. డిసెంబర్ 15 నుంచి బిగ్బాష్ లీగ్ ప్రారంభం కానుంది.
- Advertisement -