నవతెలంగాణ-హైదరాబాద్: కీలక వడ్డీ రేట్ల ను మూడోసారి ఆర్బీఐ సవరించింది. ఈసారి రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. తాజా తగ్గింపుతో రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లోనూ కీలక వడ్డీరేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన సంగతి తెలిసిందే. తాజా ప్రకటనతో కలుపుకుంటే.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపో రేటు ఒక శాతం వరకు తగ్గింది. వడ్డీరేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణగ్రహీతలపై వడ్డీ భారం ఇంకాస్త తగ్గనుంది. అంతేగాక, మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరగనుంది.
వడ్డీ రేట్ల సవరణపై ఆర్బీఐ కీలక ప్రకటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES