Friday, October 17, 2025
E-PAPER
Homeఆటలుఇండియా-పాక్‌ మ్యాచ్‌కు రికార్డు వ్యూయర్ షిప్

ఇండియా-పాక్‌ మ్యాచ్‌కు రికార్డు వ్యూయర్ షిప్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహిళల క్రికెట్‌కు ఆదరణ అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), జియో హాట్‌స్టార్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ మ్యాచ్‌ను ఏకంగా 2.84 కోట్ల మంది వీక్షించారు. వాచ్‌టైమ్ పరంగా చూస్తే ఇది 187 కోట్ల నిమిషాలుగా నమోదైంది. మహిళల క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యూయర్‌షిప్‌ కావడం విశేషం. ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి 13 మ్యాచులను సుమారు 6 కోట్ల మంది చూడగా, మొత్తం వీక్షణ సమయం 700 కోట్ల నిమిషాలు దాటింది. గత ప్రపంచకప్‌తో పోలిస్తే వాచ్‌టైమ్ ఏకంగా 12 రెట్లు పెరగడం మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్‌తోనే కాకుండా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు కూడా మంచి ఆదరణ లభించింది. ఈ మ్యాచ్‌ను దాదాపు 48 లక్షల మంది వీక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -