Saturday, June 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేంద్ర ప్రభుత్వరంగసంస్థల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

కేంద్ర ప్రభుత్వరంగసంస్థల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

- Advertisement -

– కనీస వేతనాలు అమలయ్యేలా చూడాలి : పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల నియామకాలు చేపట్టాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు కనీసవేతనాలు, సౌకర్యాలు అమలయ్యేలా చూడాలని కోరారు. గురువారం ఈ మేరకు హైదరాబాద్‌లో లేబర్‌, టెక్స్‌టైల్స్‌, నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మెన్‌ బసవరాజు బొమ్మైకి సీఐటీయూ బృందం వినతిపత్రం అందజేసింది. రాష్ట్రంలోని బెల్‌, బీఈఎల్‌, ఈసీఐఎల్‌, హాల్‌, ఎన్‌ఎమ్‌డీసీ, ప్రజ్ఞాటూల్స్‌, మిధానీ, బీడీఎల్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, డీఆర్‌డీఓ ల్యాబ్స్‌, సింగరేణి, ఆయిల్‌ తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్ష మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని ప్రస్తావించారు. ఆ సంస్థలు 70 నుంచి 90 శాతం దాకా వారిపైనే ఆధారపడి నడుస్తున్నాయని వివరించారు. ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న వారికి కనీస వేతనాలు అమలు కావడం లేదనీ, చట్టాలు వర్తింపజేయడం లేదని వాపోయారు. వారికి ఉద్యోగ భద్రత కూడా లేదని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడంలో భాగంగా నియామకాలు చేపట్టాలని కోరారు. హయ్యర్‌ పెన్షన్‌ విధానాన్ని అమలు జరపాలని విన్నవించారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ, బోనస్‌లపై ఉన్న సీలింగ్‌ను ఎత్తేయాలనీ, ప్రత్యేక వేతనాలను నిర్ణయిం చి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రాట్యూటీ చెల్లించాలనీ, కోలిండియాలో చెల్లిస్తున్న విధంగా సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు నిర్ణయిం చాలని డిమాండ్‌ చేశారు. బిహెచ్‌ఇఎల్‌ (రామచం ద్రాపురం)లో పర్మినెంట్‌ కార్మికులకు క్యాంటీన్‌ సబ్సిడీ తొలగింపు, ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యం తొలగింపు వంటి హక్కులను తిరిగి పునరుద్ధరి ంచాలని కోరారు. బీడీఎల్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల హక్కులను పరిరక్షించాలని కోరారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాని విజ్ఞప్తి చేశారు. మెమోరాండం అందజేసిన బృందంలో జె.వెంకటేశ్‌తో పాటు టి.సత్తయ్య, మురళి, రవీందర్‌ (బీడీఎల్‌), పి.ఎ.రెడ్డి (సెయిల్‌), ఎమ్‌డీ నాగుల్‌ బాషా (బిహెచ్‌ఇఎల్‌), తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -