Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నగరంలోతొలిసారి రీహాబిలిటేషన్

నగరంలోతొలిసారి రీహాబిలిటేషన్

- Advertisement -

కేంద్రీకృత వికలాంగుల వాకథాన్ ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

నవతెలంగాణ హైదరాబాద్: ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా రీహాబిలిటేషన్ -కేంద్రీకృత వికలాంగుల వాకథాన్ ‘దిశా వాకథాన్2025’ ను హెచ్ఏసిహెచ్ నిర్వహించింది. శాశ్వత నిర్మాణాత్మక రీహాబిలిటేషన్ ముందుగానే ప్రారంభించి దానిని స్థిరంగా కొనసాగిస్తే మొబిలిటీ, స్వేచ్ఛను పునరుద్ధరించగలదు అంటూ భారతదేశం వ్యాప్తంగా కుటుంబాలు,వైద్యులు మరియు విధాన రూపకర్తలకు ఈ కార్యక్రమం స్పష్టమైన సందేశాన్ని అందించింది.ఈ వాకథాన్ లో 50మంది వికలాంగులు,50 మంది వాలంటీర్లు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వాకథాన్ తర్వాత,సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్ & రికవరీ నిపుణులు గైటర్‌తో సహా రోబోటిక్ మొబిలిటీ సిస్టమ్‌లను ప్రదర్శించారు.

ఈసందర్భంగా హెచ్ఏసిహెచ్ అధ్యక్షుడు & సహ వ్యవస్థాపకుడు డాక్టర్ గౌరవ్ తుక్రాల్ మాట్లాడుతూ “భారతదేశంలో వైకల్యం అనగానే, అది శాశ్వతమని భావించబడుతుంది,కానీ ఈ వైకల్యంలో చాలావరకూ నివారించదగినది. రీహాబిలిటేషన్ సకాలంలో ప్రారంభమైనప్పుడు, నిర్మాణాత్మక ప్రోటోకాల్‌ను అనుసరించినప్పుడు, రోబోటిక్స్‌ మద్దతు లభించినప్పుడు, రోగులు త్వరగా కోలుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆసుపత్రి వాతావరణం వెలుపల ఈ కోలుకోవడం కనిపించేలా చేయడానికి దిశా వాకథాన్ నిర్వహించాము..” అని అన్నారు. హెచ్ఏసిహెచ్ అధ్యక్షుడు,సహవ్అంకిత్ గోయెల్ మాట్లాడుతూ“భారతదేశంలో వైకల్ మార్పు అవసరం.నిజమైన వ్యక్తులు, సాంకేతికత, పురోగతిని ఉపయోగించి వైకల్యం శాశ్వతం కాదనే సత్యాన్ని ప్రజల దృష్టిలోకి ఈ వాకథాన్ తీసుకువచ్చింది.

హెడ్ – కాన్సెప్ట్ & క్లినికల్ ఎక్సలెన్స్,హెచ్ఏసిహెచ్ సువిటా ఫలితంగా ఉంటుంది. మొబిలిటీ, దీర్ఘకాలిక పనితీరును రక్షించడానికి రీహాబిలిటేషన్ ఐచ్ఛికం కాదు, తప్పనిసరి అని నేటి వాకథాన్ పునరుద్ఘాటించింది ” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -