నవతెలంగాణ-హైదరాబాద్ : రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న వినాయక విగ్రహం తొలగించారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నిర్వాహకుడు మెట్టు సాయి కుమార్ను హెచ్చరించారు పోలీసులు.
రేవంత్ రెడ్డి రూపం విగ్రహం తొలగించి, మరో విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సౌత్ వెస్ట్ డీసీపీ. కాగా రేవంత్ ఏం దేవుడు కాదు.. అంటూ రేవంత్ రెడ్డి గెటప్లో ఉన్న వినాయకుడిపై రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. వెంటనే మండపాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి లేఖ రాసారు రాజాసింగ్. గోషామహల్ నియోజకవర్గంలోని అఘాపూరలో సీఎం రేవంత్ రెడ్డి గెటప్లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ తరుణంలోనే రేవంత్ రెడ్డి రూపం విగ్రహం తొలగించి, మరో విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న గణపతి తొలగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES