- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ ఈవో రాహుల్ తెలిపారు. గురువారం పోన్కల్ అనుబంధ పాత పుట్టిగూడా గ్రామంలో పాడైన బోరును పంచాయతీ కార్మికులతో బాగు చేయించారు. ప్రజలకు సురక్షిత నీరు అందించే ప్రయత్నంలో భాగంగా పాడైన బోరుకు మరమ్మతులు చేయించినట్లు చెప్పారు. అలాగే గ్రామంలో దోమల మందును స్ప్ర్పే చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
- Advertisement -