- Advertisement -
నవతెలంగాణ -పరకాల : మెగా డీఎస్సీ నిర్వహించాలని విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ కు కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, బోధన క్రైస్తవ సమితి రాష్ట్ర అధ్యక్షులు నాగేల్లి సురేష్ కోరారు. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన ఇ. నవీన్ నికోలస్ ని సురేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మారుతున్న పరిస్థితులు కనుగొనగా విద్యాబోధన అందించాలని, మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీ చేయాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించడం జరిగింది.
- Advertisement -