Sunday, June 1, 2025
E-PAPER
Homeకరీంనగర్గల్ఫ్ కార్మికులకు అండగా రేవంత్ రెడ్డి సర్కార్..

గల్ఫ్ కార్మికులకు అండగా రేవంత్ రెడ్డి సర్కార్..

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ 
గల్ఫ్ కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ వారి ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఖతార్ వెళ్లిన ప్రభుత్వా విప్ ఆది శ్రీనివాస్ కు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ శుక్రవారం ఖతర్ లోని లేబర్ క్యాంప్ లను సందర్శిస్తూ లేబర్ల బాధలు, కష్టాలు తెలుసుకొని వారికి ఆత్మ స్థైర్యాన్ని, మనో నిబ్బారాన్ని నింపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో గల్ఫ్ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను గల్ఫ్ కార్మికులకు వివరించారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ లో మరణించిన కార్మిక కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేసియా, ప్రవాసి ప్రజావాణి, గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో ప్రాధాన్యత, గల్ఫ్ సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన గల్ఫ్ అడ్వైజరీ కమిటీ గురించి వివరిస్తూ వారు ఇచ్చిన సూచనలు విని ఇంకా చేయాల్సిన విషయాలను రేవంత్ రెడ్డి తో మాట్లాడి గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ ఇప్పడు పెట్టబోయే సమావేశం లో చర్చించి దాన్ని ప్రభుత్వ హయంలో అమలు చేసే విధంగా చూస్తానని వారు చెప్పారు. గల్ఫ్ లో పనిచేసే ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో వారి వెంట టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గుగ్గిళ్ళ రవి గౌడ్,టీపీసీసీ ఖతర్ కన్వీనర్ నిజామోద్దీన్ ఖాజా, తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఫౌండర్ మెంబర్లు శంకర్ గౌడ్, ఎల్లన్న తల్లపెల్లి, వెంకటేష్, ఎల్లన్న మండపెల్లి, గడ్డి రాజు, చింతకుంట మహేందర్, తేలు నరేష్, భూమేష్, నాగేష్, శేఖర్ తో పాటు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -