Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅంబర్‌పేట బోనాల ఏర్పాట్లపై సమీక్ష

అంబర్‌పేట బోనాల ఏర్పాట్లపై సమీక్ష

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌
ఆషాడ మాసం చివరి వారం నిర్వహించే అంబర్‌పేట మహంకాళీ అమ్మవారి బోనాల ఏర్పాట్లపై సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆదివారం ధృవ ఎలైట్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బోనాల నిర్వహణపై పలు అంశాలు చర్చించారు. కమిటీ సభ్యులనుద్దేశించి దేవస్థాన కమిటీ అడ్వయిజర్‌ దుర్గాప్రసాద్‌ రెడ్డి మాట్లాడారు. బోనాలు సమర్పించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కమిటీ సభ్యుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి బోనాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ సెక్రెటరీ మల్లిఖార్జున్‌, ప్రెసిడెంట్‌ శంకర్‌ గౌడ్‌, ఆర్గనైజర్‌లు కిషోర్‌, లక్ష్మణ్‌గౌడ్‌, సభ్యులు పంజాల గిరిధర్‌ గౌడ్‌, రంగంపల్లి రాజు, చెంగలి సుధాకర్‌, గడ్డం శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -