- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్: ఆలేర్ పట్టణంలో సోమవారం 11వ వార్డులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎలుగల శ్రీనివాస్ కుటుంబాన్ని వార్డు కౌన్సిలర్ జూకంటి సంపత్ పరామర్శించారు. తన వంతు సాయంగా 50 కిలోల బియ్యం శ్రీనివాస్ కుటుంబానికి అందజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. అనారోగ్యంతో అకాలంగా మరణించిన ఎలుగల శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



