- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి మరోసారి వాయిదా పడింది. ఈ నెలలోనే జరగాల్సి ఉండగా.. T20 వరల్డ్ కప్, ఐపీఎల్ నేపథ్యంలో ముహూర్తం జూన్కు మార్చినట్లు రింకూ సోదరుడు సోనూ వెల్లడించారు. కాశీలో వివాహ వేడుక జరగనున్నట్లు తెలిపారు. సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్ 8న వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా.. తొలుత పెళ్లికి నవంబర్లో డేట్ ఫిక్స్ చేశారు.
- Advertisement -



