Tuesday, May 6, 2025
Homeజాతీయంకారు- ట్రాక్టర్‌ ఢీ.. 8 మంది మృతి

కారు- ట్రాక్టర్‌ ఢీ.. 8 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బీహార్‌లోని కటిహార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లి వేడుకకు వెళ్లివస్తున్న ఓ కారు జాతీయరహదారి 31పై సమేలీ బ్లాక్‌ ఆఫీస్‌ సమీపంలో టాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులంతా సుపౌల్‌కు చెందినవారని, వివాహ వేడుకకు హాజరై తిరిగి సొంతూరుకు వస్తుండగా ప్రమాదం జరిగిందని కటిహార్‌ ఎస్పీ వైభవ్‌ శర్మ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -