నవతెలంగాణ ఎర్రవల్లి: జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎర్రవల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అయిజ మండలం గురుదొడ్డి గ్రామానికి చెందిన భూషణ్ రెడ్డి తన భార్య తిమ్మమ్మ, కుమారుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి బైక్పై పెబ్బేరు మండలం గంగారం గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఎర్రవల్లి మండలం జింకలపల్లి స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై వీరీ బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భూషణ్ రెడ్డి భార్య తిమ్మమ్మ(33) అక్కడికక్కడే మృతి చెందింది. భూషణ్ రెడ్డి మోహన్ రెడ్డికి, కుమారుడుకి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన హైవే అంబులెన్స్లో గద్వాల ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం … ఒకరు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES