- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను రాజమహేంద్రవరం అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -