- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి: వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గేటు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన చరణ్ అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చరణ్ మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు.
- Advertisement -