Sunday, May 11, 2025
Homeజాతీయంపంజాబ్‌లో రోడ్డు ప్రమాదం : ఏడుగురి మృతి

పంజాబ్‌లో రోడ్డు ప్రమాదం : ఏడుగురి మృతి

- Advertisement -

చండీగఢ్‌: ఒక ఇన్నోవా కారును టిప్పర్‌ ఢకొీట్టిన ఘటనలో ఏడుగురు మరణించిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పాటియాల నగరంలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న ఇన్నోవా కారును ఎదురుగా వస్తున్న టిప్పర్‌ ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న ఏడుగురు మరణించారు. మృతుల్లో ఆరుగురు విద్యార్థులు, కారు డ్రైవర్‌ ఉన్నారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -