- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇన్ఫోసిస్ కంపెనీకి చెందిన వీరంతా సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా అబ్దుల్లాపూర్మెట్ ఓఆర్ఆర్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -