నవతెలంగాణ -ముధోల్
ముధోల్ మండలంలోని బోరిగాం కు వేళ్ళే దారులన్ని పోలిసుల గుప్పెట్లోకి వెళ్లిపోయాయి. బోరిగాం గ్రామంలో బుద్ధ విగ్రహం పునప్రతిష్టించాలని దళిత సంఘాల నాయకులు శుక్రవారం ఇచ్చిన చలో బోరిగాం నేపథ్యంలో పోలిసులు వాహనాలను దారి మళ్ళీస్తున్నారు. శుక్రవారం ఉదయం బోరిగాం కు వాహనాలు యధావిధిగా నడిచాయి. మధ్యాహ్నం నుండి బోరిగాం కు వేళ్ళే విట్టోలి- ముధోల్ రోడ్డుకు పోలిసులు బారీ గేట్లు తో తాత్కాలికంగా రోడ్డు ను ముసి వేశారు .శాంతి భద్రతల పరిరక్షణ కు వాహనదారులు, ప్రయాణికులు సహకరించాలని పోలిసులు కోరారు. అత్యవసరం ఉంటే తప్ప వహనాలకు మినహాయింపు ఇవ్వడం లేదు. ముధోల్ నుండి అబ్దుల్లాపూర్ వైపు వేళ్ళే వారు తరోడ ,ఎడ్ బిడ్ తాండా మీదిగా ,వేళ్ళాలని పోలిసులు సూచింస్తున్నారు. కొంతమంది వాహనదారులు వ్యవసాయ చేన్ల దారులతో తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ముధోల్ వైపు నుండి బోరిగాంకు ఆందోళనకారులు రాకుండా పోలిసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు.
బోరిగాంకు దారి బంద్.. వాహన దారులు సహకరించాలని పోలిసుల సూచన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES