నవతెలంగాణ-హైదరాబాద్:పలు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి భారీ నష్టాన్ని చేకుర్చాయి. ఎడాతెరిపిలేకుండా కురిసిన వానాలకు వరద నీరు పొటెత్తింది. దీంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్రియ రహదారులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం ఆయా రోడ్ల మరమ్మతులకు సన్నాహాలు చేస్తుంది. జేసీబీల సాయంతో అస్తవ్యస్తంగా మారిని రోడ్లను తొలగిస్తున్నారు.
అంతేకాకుండా పర్వత ప్రాంతాల సమీపంలో కొండ చరియలు రోడ్లపై విరిగిపడ్డాయి. భారీ పరిమాణంలోని బండ రాళ్లు రోడ్లపై పడడంతో..పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటికి భారీ స్థాయిలో బురద రోడ్లపైకి కొట్టుకొచ్చింది. పర్వత ప్రాంత సమీపంలోని రోడ్ల వెంట మట్టి పేల్లలు పడిపోయాయి.



